లక్నో : మందులేని మహమ్మారి కరోనా వైరస్ను కట్టడి చేయడానికి లాక్డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్క్షప్తి చేస్తున్నా పలువురు మాత్రం యధేచ్చగా లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన ఓ బీజేపీ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని బారాబంకి జిల్లా ఎస్పీ అవరింద్ చతుర్వేదీ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లాలో లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ స్థానిక బీజేపీ నేత సుధీర్సింగ్ బుధవారం క్రికెట్ మ్యాచ్ను నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందటడంతో ఎస్పీ అదేశాల మేరకు అక్కడి చేరుకున్నారు. (‘వుహాన్’ డైరీలో నమ్మలేని నిజాలు)
లాక్డౌన్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ.. కేసు నమోదు